విద్యా, వైద్య రంగాలను ప్రభుత్వం రెండు కళ్లుగా భావించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం జంగేడు కెజిబివి పాఠశాల, గణపురం మండలంలోని బిసి, మోడల్, కెజిబివి పాఠశాలలు, చిట్యాల మండలంలోని మోడల్ పాఠశాలలలో విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.