భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన భారీ వడగళ్ల వాన రైతుల కళ్ళల్లో కన్నీరు మిగిల్చింది. ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షం రైతులను భారీగా నష్టానికి గురిచేసింది. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గ్రేడింగ్ చేసిన వందలాది క్వింటాళ్ల మిర్చి నీట మునిగింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని బుధవారం రైతులు కోరుతున్నారు.