మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు జరిగే కాళేశ్వరం సరస్వతీపుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు మల్టీ జోన్ ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి కాళేశ్వరంలో దేవాలయ పరిసర ప్రాంతాలు,
పార్కింగ్ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల క్యూ లైన్ లు, పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించారు.