కేంద్ర ప్రభుత్వం నెహ్రూ కుటుంబం పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లిలో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నేషనల్ హెరాల్డ్ అనే దినపత్రిక స్థాపించి ప్రజల సమస్యలను వెలికితీయడంలో పనిచేసిన పత్రికపై ప్రధాని అధికార దాహంతో ఈడీ, ఐటీ నీ ప్రయోగించి కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు.