శనివారం నుండి అధికారులు కాళేశ్వరంలో మకాం వేసి, అన్ని ఏర్పాట్లను సమీక్షించి పర్యవేక్షణ చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కాళేశ్వరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శిభిరాల ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన స్టేజి, మైక్ ఇతర ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, ఆహార ఏర్పాట్లపై అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.