కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు లభిస్తుందని, పైరవీలతో పదవులు రావని, అర్హతలు ఉన్న వారికే పదవులు వస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం రేగొండ మండల కేంద్రంలో రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది.