భూపాలపల్లి లోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని సోమవారం శాంతి కపోతాలు ఎగురవేసి ఎస్పీ కిరణ్ ఖారే ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పోటీల్లో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ , రన్నింగ్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పోలీసుశాఖ, జ్యుడీషియల్, మీడియా, సింగరేణి, అటవీ శాఖ, జెన్ కో, రెవెన్యూ , ఎక్సైజ్ శాఖల తరుపున క్రీడాకారులు పాల్గొంటారు.