శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో శనివారం సాయంత్రం కనులపండుగగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. పెద్దమ్మతల్లి వారి ఆశీస్సులు, దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కొప్పుల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.