త్వరలో జరగనున్న స్థానిక జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం సాయంత్రం టేకుమట్లలో అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది.