కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ తెలియజేశారు. మహబుబాబాద్ జిల్లా దంతాలపల్లిలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను కార్యకర్తలు, ముఖ్య నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.