
విమాన ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
విమానం కూలిన ఘటనలో భారత్ సంతతికి చెందిన సర్జన్ జోయ్ సైనీ మరణించింది. ఈ ప్రమాదం అమెరికాలోని న్యూయార్క్లో జరిగింది. అయితే ఈ విమానాన్ని భర్త నడిపినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె, ఇద్దరు పిల్లలు, వారికి కాబోయే జీవిత భాగస్వాములు చనిపోయారు. కొలంబియా కౌంటి ఎయిర్పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు సైనీ ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం విఫలం కావడంతో విమానం కూలిపోయింది. దీంతో అందులోని ఆరుగురు మరణించారు.