
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు L&T షాక్ ఇచ్చింది. మెట్రో ఛార్జీల పెంపు అనివార్యమని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే రూ.6500 కోట్ల భారీ నష్టాల్లో ఉన్నామని, కోవిడ్ టైంలో తీవ్రంగా నష్టపోయామని L&T వెల్లడించింది. ఛార్జీల పెంపుపై గతంలో ప్రభుత్వం వద్ద అనుమతిని కోరినట్టు పేర్కొంది. ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44% పెరిగిన నేపథ్యంలో, హైదరాబాద్లో కూడా ఎంత మేరకు పెంచాలన్న దానిపై కంపెనీ ఆలోచన చేస్తోంది.