డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుంది. ఈ సర్వే సందర్భంగా అధికారులు క్షుణ్ణంగా ప్రజల వద్ద నుంచి వివరాలను సేకరించి నమోదు చేసుకుంటున్నారు. మొబైల్తో ఇంటి బయట, ఇంటి లోపల ఫొటో తీసుకుంటున్నారు. ఈ సర్వేలో సీసీ మంజుల, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.