అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్ లను గురువారం పట్టుకున్నట్లు నర్సింహులపేట ఎస్సై సతీష్ తెలిపారు. నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి, జయపురం గ్రామ పరిసరాలు ఉన్న ఆకేరు వాగు నుండి అక్రమ ఇసుక తరలింపుకు పాల్పడుతున్న 10 ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ కు తరలించారు.