ఈనెల 27న వరంగల్లో జరిగే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని చేర్యాల మండల రూరల్ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం చేర్యాలలో చలో వరంగల్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు బహిరంగ సభకు తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.