జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం అంగన్వాడి కేంద్రంలో గురువారం ఉపాధ్యాయురాల్లు D. పద్మ, టీ. నిర్మల, ఆయా B. ఉపేంద్ర మరియు పూర్వ ప్రాథమిక విద్యార్థులతో భారత సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేటట్లు రంగులు పూసుకుని ముందస్తు హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసిన పిల్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.