కొమురవెల్లి మండలం గౌరాయపల్లి గ్రామంలో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి సహకారంతో మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నర్ర రాములమ్మ 60, 000 రూపాయలు, ఇంద్రపురి చంద్రశేఖర్ 45, 000 రూపాయలు, బొచ్చు కల్పన 34, 000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.