జనగాం: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

61చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 87మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో రాములు, ఆర్ఐ రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గీరగాని కుమార్, తొర్రూరు ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్