జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని రేగుల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు మాధవి ఆధ్వర్యంలో పాఠశాల సెలవుల ముందు ముందస్తుగా విద్యార్థులచే రంగవల్లులు పాఠశాల ఆవరణలో అందరిని ఆకర్షించే విధంగా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు స్వరూప, జయమ్మ, ఆయాలు మరియు విద్యార్థులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.