
అమిత్ షా అత్యున్నత స్థాయి సమీక్ష
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశ భద్రతపై కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్లతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు.