జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ లో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం బుధవారం శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డిలు ప్రారంభించారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉండి రైతులు పండించిన పంట దళారుల చేతిలోకి వెళ్లకుండా సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తుందని రైతులు నేరుగా ఇక్కడే అమ్మాలని అన్నారు.