యువత మాదక ద్రవ్యాల మాయలో పడకుండా బంగారు భవిష్యత్ కి బాటలు వేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నషా ముక్తి అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జనగామ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఏర్పడేందుకు అందరూ కృషి చేయాలన్నారు.