చేర్యాల మండలం రాంసాగర్ గ్రామంలో ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఐదవ మహాసభ వాల్ పోస్టర్ ని చేర్యాల డివిజన్ కార్యదర్శి తాడూరి భరత్ గురువారం విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు అభ్యుదయ, ప్రజా ఉద్యమాల గుమ్మం ఖమ్మం నగరంలో ఈనెల 25, 26, 27న నిర్వహిస్తున్నారని అన్నారు. మహాసభలకు రాష్ట్ర, సెంట్రల్ యూనివర్సిటీలు విద్యార్థి, ప్రతినిధులు వివిధ రంగాలకు చెందిన అతిథులు హాజరవుతున్నారు.