జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు వెళ్లిన పల్లా అక్కడ జారి పడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాాల్సి ఉంది.