చర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం

77చూసినవారు
చర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండల పరిధిలోని చర్లపాలెం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బుధవారం కమ్యూనిటీ డెవలప్ మెంట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను నిర్మించారు. ఈ ప్లాంట్ ప్రారంభ సమావేశంలో శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చాలా చేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్