ధర్మ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని ధర్మ జాగరణ సమితి జనగాం జిల్లా సంయోజక్ సత్యనారాయణ అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ చైతన్య రథయాత్ర శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు చేరుకుంది. ఈ చైతన్య రథానికి ఆలయ అర్చకులు రమేష్, రామన్న శర్మలు ప్రత్యేక పూజలు చేశారు.