జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ స్థానిక పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం ట్రాఫిక్ సమస్యలపై ఇంజనీరింగ్, మున్సిపల్, పోలీస్ అధికారులతో నగరంలోని పలు సెంటర్ లను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రవాణా కు అనుగుణంగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందన్నారు.