జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని గిర్ని తండా ప్రాంతంలో పెట్రోల్ బంక్ కు ఎదురుగా కృష్ణ, గోపీలు ఆంధ్ర ప్రాంత వాసులు కొంతకాలంగా ఇటుక బట్టీలు నడుపుతున్నారు. అందులో తండా భాస్కర్ అనిత దంపతుల కొడుకు విగ్నేష్ రోజువారి కూలీగా శుక్రవారం రాత్రి పనికి వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.