మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండా లో శనివారం రాత్రి అల్లుడి పై కారం చల్లి అత్త , మామ, భార్య కత్తి తో దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన అల్లుడు బాల (35)ను ఇరుగుపొరుగు వారు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు చేరుకుని విచారణ జరుపుతున్నారు.