మహబూబాబాద్ పట్టణం లోని ఎస్పీ క్యాంపు కార్యాలయం గేట్ ను బుధవారం రాత్రి కారు ఢీకొంది.
మహబూబాబాద్ పట్టణం లో అతి వేగం తో పలువురిని ఢీకొంటూ అదుపు తప్పి
ఎస్పీ క్యాంపు కార్యాలయం గేటుని ఢీకొని నిలిచిపోయింది. దీంతో పోలీసులు
ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కారు దిగి మరికొందరు పారిపోయారని తెలిసింది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా మరేదైన కారణమా అని విచారణ జరుపుతున్నారు.