కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 21న జరుగబోయే ర్యాలీని జయప్రదం చేయాలని బుధవారం వక్ఫ్ పరిరక్షణ టీం సభ్యులు అస్లం, జావిద్, అంజద్ దంతాలపల్లిలోని ముస్లింలను కోరారు. ఈ ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.