తొర్రూరు మండలంలోని కంటాయపాలెం జెడ్పి ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థినులు సుప్రియ, రిషిక, నిత్యశ్రీ బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ప్రభాకర్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు విద్యార్థులను అభినందించారు. ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించారు.