పాకిస్తాన్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న భారత సైన్యానికి కొత్తగూడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వజ్జా సారన్న శుక్రవారం అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన తెలుగు వీరుడు అమర జవాన్ మురళి నాయక్ మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సైనికుల వీరత్వం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు.