
పాక్ కాల్పులకు సంబంధించిన సీసీ టీవీ వీడియో వైరల్
జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో పాకిస్థాన్ జరిపిన కాల్పులకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. ఓ నివాసంలో నమోదైన ఈ ఫుటేజీలో పాక్ కాల్పులకు తెగబడిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సివిలియన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, భారత భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షించుకుంటూ వెంటనే స్పందించాయి. పాక్ దాడిని తిప్పికొట్టాయి.