అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. సంక్షేమానికి నిధులతో పాటు, పథకాలను అమలు చేస్తోందన్నారు. బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గీతా కార్మికుల సంక్షేమం కోసం పూర్తిస్థాయి సబ్సిడీతో అందించే కాటమయ్య రక్షణ కవచం కిట్స్ అందించారు. మహబూబాబాద్ ఎమ్మల్యే క్యాంపు కార్యాలయంలో వాటిని పంపిణీ చేశారు.