
పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేత
భారత్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. భారత్ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భీకర దాడి చేసింది. అలాగే, పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. NOTAM జారీ చేసింది. మద్యాహ్నం 12 గంటల వరకు దేశ, విదేశ విమానాలకు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. పాక్ ఫైటర్ జెట్స్ ఎగరకుండా చేసినట్లు తెలుస్తోంది.