
సరిహద్దుల్లో కాల్పులు.. ఏపీ జవాన్ వీరమరణం
జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఏపీ జవాన్ వీరమరణం పొందారు. శుక్రవారం రాత్రి సరిహద్దుల వెంట పాక్ కాల్పులు జరిపింది. దీనికి మన సైనికులూ దీటుగానే బదులిచ్చారు. ఈ కాల్పుల్లో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు చెందిన జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. జవాన్ మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.