మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ శివారులోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. భావోజీగూడెం శివారు వెంకురాం తండా బుచేతండాలకు చెందిన భూక్య సంతోష్, గుగులోత్ కార్తిక్ ద్విచక్ర వాహనం, మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్, కార్తిక్ మృతి చెందారు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న సుధీర్కు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.