మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీరోల్ మండల పరిధిలోని బూరుగుచెట్టు తండా జీపీలోని మాంజాతండాలో మంగళవారం రాత్రి మాంసం కూర చేయలేదని మాలోత్ కళావతి (38)ని భర్త బాలు తీవ్రంగా కొట్టాడు. దీంతో కళావతి అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.