తొర్రూరు: పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

50చూసినవారు
తొర్రూరు: పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌కేకన్‌ ఆదేశాల మేరకు మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీ చేపట్టారు. తొర్రూరు మండలంలోని అన్ని కీలక ప్రాంతాల్లో విసృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సివిల్‌ పోలీస్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌), ఫారెస్ట్‌, స్పెషల్‌ ఫోర్స్‌, బాంబు స్వాడ్‌, డాగ్‌ స్వాడ్‌ ఇతర విభాగాల నుంచి 50మంది సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్