గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

74చూసినవారు
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం-మండపాక 163 జాతీయ రహదారిపై జరిగింది. ఎస్సై హరీష్ వివరాల ప్రకారం.. మండపాక గ్రామానికి చెందిన తోలం పాపారావు(50) మహితాపురం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని అన్న సమ్మయ్య ఫిర్యాదు మేరకు శనివారం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్