ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలకేంద్రంలో ఈనెల 5న బాలికపై అత్యాచారం జరిగిందని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు పోడిశెట్టి సాయి అనే వ్యక్తిని బుధవారం జ్యూడీషియల్ రిమాండుకు తరలించారు. మహిళల, బాలికలపై అత్యాచారానికి పాల్పడితే కేసులు నమోదు చేసి, నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్సై దిలీప్ తెలిపారు.