ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో గురువారం కురిసిన వర్షానికి బోగత జలపాతం చూపరులను కట్టి పడేస్తుందని శుక్రవారం మీడియాతో స్థానికులు తెలిపారు. సంవత్సర కాలంగా వెలవెలబోయిన జలపాతం వర్షాకాలంలో జలకళ సంతరించుకుంది. తెలంగాణ నయాగరాగా పిలవబడే జలపాతాన్ని పర్యాటకులు వీక్షిస్తుంటారు. జల సోయగాలతో మైమరపించే జలపాతానికి సౌకర్యాలు, అభివృద్ధి పనులు మందకోడిగా సాగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.