మంత్రి సీతక్క పుట్టినరోజును పురస్కరించుకొని ములుగు ఏరియా ఆసుపత్రిలో ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హాస్పిటల్ లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అద్యక్షుడు డాక్టర్ అల్లెం అప్పయ్య ములుగు జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికాంత్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ లాల్, డ్యూటీ డాక్టర్లు పాల్గొన్నారు.