ప్రకృతి విపత్తుతో భయంకరంగా వర్షాలు కురువడంతో కేరళ (వయనాడ్)లోని ప్రజలు సర్వం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో బాధితులకు మన వంతు సహాయం చేద్దామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. స్పందించిన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ రూ. 2 లక్షలు, యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్ రూ. 50 వేల చెక్కులను గురువారం మంత్రి సీతక్కకు అందజేశారు.