ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో సీఆర్టీలు సోమవారం నిరవధిక సమ్మె చేపట్టారు. 20 ఏళ్లుగా చాలి చాలని జీతాలతో ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.