ఏటూరునాగారం: కూరగాయలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

54చూసినవారు
ఏటూరునాగారం: కూరగాయలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగపేటకు చెందిన కూరగాయల వ్యాపారులు చిన్నబోయినపల్లిలో జరుగుతున్న సంతకు ఆటోలో కూరగాయలు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో హనుమాన్ నగర్ సమీపంలో ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్