ములుగు జిల్లా ఏటూరు నాగారం , మంగపేట తాడ్వాయి మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి అకాల వర్షం కురిసింది. అకాల వర్షాలకు కళ్ళాలో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. అకాల వర్షాలతో చేతికి వచ్చిన ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం తడవడం తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.