ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామ ప్రజలకు గోదావరి కరకట్ట ఎత్తు పెంచి రక్షణ కల్పించాలని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యం డిమాండ్ చేశారు. బుధవారం రామన్నగూడెం గోదావరి కరకట్టను బీజేపీ నాయకులు పరిశీలించారు. సత్యం మాట్లాడుతూ 2022లో భారీ వర్షాల కారణంగా గ్రామంలోకి భారీగా వరదలు వచ్చాయన్నారు. ఆ తర్వాత కరకట్ట కోతకు గురైన చోట రూ. 70 లక్షలతో తాత్కాలిక మరమ్మత్తు చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు.