ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం,
మంగపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రహదారుల నిర్మాణాలకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు.
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి లో 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ ను ప్రారంభించి, మొక్కను నాటారు.
డిప్యూటీ రేంజ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో సి సి ఎఫ్ ప్రభాకర్ రావు, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్ పాల్గొన్నారు.